ప్రపంచ దేశాలపై మళ్ళీ ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఇండియాలో కూడా నెమ్మదిగా విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్ మరియు పొరుగుదేశం చైనాలో అసాధారణ రీతిలో విజృంభణకు కారణమైన ఈ కొత్త వైరస్ ఇపుడు భారత్లోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త వేరియింట్ వెలుగు చూసింది. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్బీబీ1.5ను తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఇండియన్ సార్స్-కోవిడ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు ఏడుకి చేరినట్లయింది. కాగా ఈ ఏడు కేసులలో.. గుజరాత్లో మూడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మరియు తెలంగాణలో ఒక్కొక్కటి కనుగొనబడినట్లు ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా ఈ ‘ఎక్స్బీబీ.1.5’ జాతి అనేది ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియంట్కి సంబంధించినది. ఇది ఒమిక్రాన్ బీఏ.2.10.1 మరియు బీఏ.2.75 సబ్వేరియంట్ల రీకాంబినెంట్ గా గుర్తించబడింది. అయితే దీనిపై నిపుణులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్బీబీ మిగిలిన వేరియంట్లతో పోలిస్తే 108 శాతం మేర వేగంగా వ్యాపిస్తుంది. అంతేకాకుండా టీకాలు తీసుకున్న వారికి కూడా సోకగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీంతో వైద్యులు దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. కాగా ఈ కొత్త రీకాంబినెంట్ స్ట్రెయిన్ రోగనిరోధక శక్తిని క్షీణింపజేయడంతో పాటు ఇన్ఫెక్షన్లో మెరుగ్గా ఉంది. ఇక ప్రస్తుతం ఈ సబ్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విస్తరిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE