టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR Meeting With Party MLAs, kcr latest news, Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 9, గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో నామినేషన్ పక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీ ఫారాల అందజేయడం, మున్సిపల్ ఎన్నికలపై విధివిధానాలు వివరించే క్రమంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మున్సిపల్‌ టికెట్ల కేటాయింపులో నాయకుల మధ్య అసంతృప్తి తలెత్తకుండా, వివాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. మున్సిపాలిటీల వారిగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ పరిశీలించి, సూచనలు చేయనున్నారు. కొన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలకు, ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ బీ ఫారాలను అందించనున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 13 =