తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నూతన కలెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఇతర అధికారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సర్వమత పార్ధనలు కూడా నిర్వహించారు.
ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరాకలాన్లో 44 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో ఈ సమీకృత కలెక్టరేట్ సముదాయం నిర్మాణం జరిగింది. వివిధ శాఖల నిర్వహణ కోసం గ్రౌండ్ ఫ్లోర్లో 42 గదులు, ఫస్ట్ ఫ్లోర్ లో 29 గదులు, సెకండ్ ఫ్లోర్ లో 34 గదులు నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY