రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో ఎక్కడా లేని రైతు వేదికలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాలు దాదాపుగా అన్ని చోట్ల పూర్తి కావొచ్చాయి. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రైతు వేదికను ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కొడకండ్లకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు వేదిక శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ