తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ముందుగా అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించింది. అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇంటర్నెట్ సేవలు మరియు అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో అక్టోబర్ 31, శనివారం వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేటితో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు ముగియనుంది.
మరోవైపు రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుదారుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. శుక్రవారం నాటికే అన్ని కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఎల్ఆర్ఎస్కు సంబంధించి 24,14,337 దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నేటితో గడువు పూర్తవనుండడంతో ఈ రోజు కూడా పెద్దసంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ