తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయితీ చట్టం, కొత్తగా రూపొందించి ఆమోదించిన పురపాలక చట్టం అమలు, గ్రామాలలో 60 రోజుల పాటు సాగే కార్యాచరణ ప్రణాళికలో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్త రెవిన్యూ చట్టం రూపకల్పనపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పరిపాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పంచాయితీ రాజ్ చట్టం, మునిసిపల్ చట్టం, కొత్త రెవిన్యూ చట్టంపై కసరత్తు చేసారు. ఇటీవలే నూతన మునిసిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి అమలులోకి తెచ్చారు. ఇందులో కలెక్టర్లకి ప్రత్యేక అధికారాలు కల్పించారు, ఇదే పద్ధతిలో కొత్తగా రూపొందించే రెవిన్యూ చట్టంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాల్లో కలెక్టర్లు, అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలలో అనేక అంశాలను చర్చించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=NaP9CUbRfg4]