భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట ఆమె కుటుంబసభ్యులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. ముందుగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతి కొద్దిసేపు యాదాద్రి ఆలయ పరిసరాలను కూడా పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE