తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు వలన పెద్దఎత్తున నష్టం జరిగిందని, జాతీయ విపత్తు నిర్వహణ కింద రాష్ట్రానికి సాయం అందించాలని కోరినట్టు తెలుస్తుంది. దాదాపుగా 40 నిముషాలు పాటుగా ఏకాంతంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు కీలక అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. మరోవైపు మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ