తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు నీటి ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ నోటిఫికేషన్ అంశం, నీటి కేటాయింపులు, జల వివాదాలుపై సీఎం కేసీఆర్ కేంద్రమంత్రితో కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 5 అంశాలపై లేఖలు అందించినట్టు సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే ఓ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో సీఎం సమావేశమై చర్చించనున్నారు. ఇక సెప్టెంబర్ 26న సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ