పర్వతారోహకుడు తుకారాంకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.35 లక్షల ఆర్ధిక సాయం

35 Lakhs Financial Assistance to Mountaineer Amgoth Tukaram, Andhra Pradesh govt launches scheme, AP CM YS Jagan, CM YS Jagan, CM YS Jagan Announces Rs 35 Lakhs Financial Assistance to Mountaineer Amgoth Tukaram, Financial Assistance to Mountaineer Amgoth Tukaram, Jagan Gifts 35 Lakhs To Telangana Mountaineer, Mango News, Mountaineer Amgoth Tukaram, TS mountaineer gets a surprise incentive from AP CM, YS Jagan Announces Rs 35 Lakhs Financial Assistance

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తన సాహసయాత్రలు, పర్వతారోహణ వివరాలను తుకారాం సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశాడు. ఈ సందర్భంగా తుకారాంను మెచ్చుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్ రూ.35 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ అధికారుల నుంచి తుకారాం చెక్కు అందుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఆర్ధిక సాయంపై తుకారాం స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనపై చూపిన అభిమానానికి, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. భవిష్యత్తులో కూడా తనకు సాయం అందిస్తానంటూ సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twelve =