ముదోల్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆరువేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పిప్రి లిఫ్టు ఇరిగేషన్ పనులను చేపట్టాలని, గడ్డన్నవాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పదికిలోమీటర్ల పొడవు సిసి కెనాల్ ను సత్వరమే పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం పరిధిలోని అర్లి వంతెన కూలిపోయే దశలో వున్నందున పునర్నిర్మాణ పనులను చేపట్టాలని, గుండెగావ్ గ్రామం ముంపుకు గురవుతున్నందున గ్రామ ప్రజలను ఆదుకునేందుకు నిర్వాసిత సహాయ కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ