యూకే నుండి భారత్ కు వచ్చిన ఆరుగురిలో కొత్త కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు ఈ వైరస్ వ్యాప్తిపై మీడియాతో మాట్లాడారు. “కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ భయంకరమైనది కాదు. దీనికి ఎక్కువ చంపే శక్తి లేదు, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది అని మాత్రమే నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నాము. 10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారు. ప్రచార మాధ్యమాలు ఇంకా ప్రజలను భయపెట్టవద్దు. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ