ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూ, అతి చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన బిర్సా ముండా, దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ