ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ అహింస, సత్యాగ్రహదీక్షల ద్వారా స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారని సీఎం కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని మహాత్మాగాంధీ జీవితం చాటి చెప్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ