ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై శనివారం తెల్లవారుజామున మినీ బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. అనంతరం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఆ వాహనాలను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయాలు పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఓవర్ టేకింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికీ మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ