నాటితరం ప్రఖ్యాత నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కాంతారావు 400 వందలకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారన్నారు. కాంతారావు సినీ కళారంగానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కండ్లయితే కాంతారావు ‘నుదుట తిలకం’గా ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE