భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై సీఎం కేసీఆర్ ప్రకటన

CM KCR Released Statement And Condemns Disqualification Of Congress MP Rahul Gandhi,CM KCR Released Statement Of Rahul Gandhi,CM KCR Condemns Disqualification Of Rahul Gandhi,Congress MP Rahul Gandhi,Mango News,Mango News Telugu,Rahul Gandhi Disqualified As Lok Sabha Member,BRS Chief KCR,Rahul Gandhi Disqualified From Lok Sabha,Rahul Gandhi Disqualified As MP,Congress MP Rahul Gandhi Latest News,Congress MP Rahul Gandhi Latest Updates,CM KCR News And Live Updates

లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. “భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం” అని సీఎం కేసీఆర్ అన్నారు.

“ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ముందుగా ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా, ఈ కేసును విచారించిన అనంతరం గుజరాత్ లోని సూరత్‌ కోర్టు గురువారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలడం, 2 ఏళ్ల శిక్ష పడిన నేపథ్యంలో లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =