దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఆగస్టు 21, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,823 కు, మరణాల సంఖ్య 54849 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం మరింతగా పెరిగింది. రోజువారీ పరీక్షల సామర్ధ్యం 9 లక్షలకు చేరింది. రాష్ట్రాలన్నీ టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తూ కరోనా నియంత్రణకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 6,57,450
- తమిళనాడు – 3,67,430
- ఆంధ్రప్రదేశ్ – 3,34,940
- కర్ణాటక – 2,64,546
- ఉత్తరప్రదేశ్ – 1,77,239
- ఢిల్లీ – 1,58,604
- పశ్చిమ బెంగాల్ – 1,32,364
- బీహార్ – 1,17,671
- తెలంగాణ – 99,391
- అస్సాం – 86,053
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu