తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు భారీ వరాలు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని 844 గ్రామా పంచాయితీలకు రూ.20 లక్షలు చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తునట్టు చెప్పారు. అలాగే మండల కేంద్రాలకు అభివృద్ధి కోసం రూ.30 లక్షలు మంజూరు చేస్తునట్టు తెలిపారు. ఇక నల్గొండ మునిసిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మునిసిపాలిటికి రూ.5 కోట్లు, జిల్లాల్లోని మిగతా ఒక్కో మునిసిపాలిటికి కోటి రూపాయాల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తునట్టు ప్రకటించారు. వీటన్నింటికి రూ.186 కోట్లు అవుతుందని, జీవో రేపే విడుదల చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో అర్హులందరికీ త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్కార్డులు మంజూరు:
కరోనా వలన చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా నిరుపేదలుకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. అర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే పక్రియ కూడా త్వరలోనే చేపడతామని చెప్పారు. వేరుబడ్డ వారికీ, ఇతరత్రా కారణాల వలన అవసరం పడిన వారికీ ప్రతి గ్రామంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ