తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మార్చి 9, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, సొంత జాగాలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, పోడు భూములు, బడ్జెట్ లో పేర్కొన్న పలు ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. చివరిగా రాష్ట్ర కేబినెట్ భేటీ ఫిబ్రవరి 5న జరగగా, ఆ సమావేశం సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై కేబినెట్ కీలకంగా చర్చించి, ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుండడంతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE