గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Political Leaders and Cinema Celebrities Cast their Vote in GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు:

– బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 4 లోని పోలింగ్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ బూత్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు.
– చిక్కడపల్లిలో బిజెవైఎం ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ఓటు వేశారు.
– శాస్త్రిపురం పోలింగ్ బూత్ లో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఓటు వేశారు.
– జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు, అక్కినేని నాగార్జున ఓటు వేశారు.
– కుందన్ బాగ్ లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– నాంపల్లిలో వ్యాయామ పాఠశాలలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఓటు వేశారు.
– అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓటు వేశారు.
– కుందన్ బాగ్ లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eleven =