గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు:
– బంజారాహిల్స్ లోని నందినగర్ పోలింగ్ కేంద్రం వద్ద టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 4 లోని పోలింగ్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ బూత్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు.
– చిక్కడపల్లిలో బిజెవైఎం ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ఓటు వేశారు.
– శాస్త్రిపురం పోలింగ్ బూత్ లో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఓటు వేశారు.
– జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు, అక్కినేని నాగార్జున ఓటు వేశారు.
– కుందన్ బాగ్ లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– నాంపల్లిలో వ్యాయామ పాఠశాలలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఓటు వేశారు.
– అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓటు వేశారు.
– కుందన్ బాగ్ లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ