తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 25-సెప్టెంబర్ 10 మధ్య నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో రాష్ట్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ముందుగా ఆగస్టు 25, గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇదే క్రమంలో ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిపాలనా, ప్రజల సౌకర్యార్ధం అన్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండి విధులు నిర్వర్తించేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 9 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు ప్రారంభం కాగా, రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మరో 9 జిల్లాల్లో పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టి పూర్తయిన సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY