రేపు సూర్యాపేటకు రానున్న సీఎం కేసీఆర్, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ

CM KCR Meet Col Santosh Babu Family, Col Bikkumalla Santosh Babu, Col Santosh Babu, Col Santosh Babu Family, colonel santosh babu bihar regiment, India China border clash, India-China Border, Indian Army Soldier Santosh Babu, KCR Meet Col Santosh Babu Family Members, Santosh Babu, Telangana CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 22, సోమవారం నాడు సూర్యపేటకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్‌ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీఎం కేసీఆర్ సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, సహాయం అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =