హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత సత్తిబాబు రూ.15 లక్షల చెక్కును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటిఆర్ కు సోమవారం నాడు అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu