తెలంగాణలో కాంగ్రెస్లో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. పీసీసీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ను నియమించింది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న దిగ్విజయ్ సింగ్ను టీ-కాంగ్రెస్ సీనియర్ నేతల సమస్య ను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిందిగా సూచించింది. ఈ క్రమంలో ఆయన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి హైకమాండ్ సూచనలను తెలియజేశారు. మరో రెండు రోజుల్లో తాను వస్తానని, సీనియర్ల సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని, తొందరపడొద్దని దిగ్విజయ్ సింగ్ కోరడంతో.. ఈరోజు సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్న సీనియర్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ