రేపు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ

CM YS Jagan to Visit Yadlapalli of Bapatla District Tomorrow will Distribute Tabs to 8th Class Students,Cm Ys Jagan Visit To Bapatla,Jagan Distribution Of Tabs,Jagan Tabs Disctrubuting Students,CM YS Jagan To Distribute Tabs,YS Jagan To Distribute Tabs Students,4.6 Lakh Tabs For Govt Students,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (డిసెంబర్ 21, బుధవారం) బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్ధులకు సీఎం వైఎస్ జగన్ ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.6 లక్షల మంది విద్యార్థులకు, 60,000 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ ట్యాబ్స్ అందజేయనున్నట్టు తెలుస్తుంది.

ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చేరుకోనున్నారు. అక్కడ 11 గంటల నుంచి 1 గంట వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంతో పాటుగా, బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =