ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (డిసెంబర్ 21, బుధవారం) బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్ధులకు సీఎం వైఎస్ జగన్ ట్యాబ్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.6 లక్షల మంది విద్యార్థులకు, 60,000 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ ట్యాబ్స్ అందజేయనున్నట్టు తెలుస్తుంది.
ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోనున్నారు. అక్కడ 11 గంటల నుంచి 1 గంట వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంతో పాటుగా, బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE