భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ, మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 18,552 కరోనా పాజిటివ్ కేసులు, 384 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 27, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,08,953 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో 18 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 15,685 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 2,95,881 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,97,387 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, ఢిల్లీ, గుజరాత్, రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 1,52,765
- ఢిల్లీ – 77,240
- తమిళనాడు – 74,622
- గుజరాత్ – 30,158
- ఉత్తర ప్రదేశ్ – 20,943
- రాజస్థాన్ – 16,787
- పశ్చిమబెంగాల్ – 16,190
- హర్యానా – 12,884
- మధ్యప్రదేశ్ – 12,798
- తెలంగాణ – 12,349
- ఆంధ్రప్రదేశ్ – 11,489
- కర్ణాటక – 11,005
- బీహార్ – 8,678
- అస్సాం – 6,920
- జమ్మూ కశ్మీర్ – 6,762
- ఒడిశా – 6,350
- పంజాబ్ – 4,957
- కేరళ – 3,877
- ఉత్తరాఖండ్ – 2,725
- ఛత్తీస్ ఘడ్ – 2,545
- జార్ఖండ్ – 2,294
- త్రిపుర – 1,331
- మణిపూర్ – 1,075
- గోవా – 1,039
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu