తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,004 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 141 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 6, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,35,337 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 59 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.39 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,30,222 కు చేరుకుంది. ప్రస్తుతం 1,004 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం నాడు 11,632 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,74,36,440 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,05,815 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 387 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY