ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 7, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పలు సంస్థలకు భూముల కేటాయింపు, సాగునీటి ప్రాజెక్టులు, మూడు రాజధానుల అంశం, సీపీఎస్, దేవాదాయ శాఖలో ఈవోల నియామకం, జగనన్న చేయూత పథకం, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సహా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY