తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 164 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4484 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 449 కి చేరింది . అలాగే కొత్తగా నమోదైన 9 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 174 కి పెరిగినట్టు తెలిపారు.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 133 కేసులు, మేడ్చల్ లో 6, రంగారెడ్డి జిల్లాలో 6, సంగారెడ్డిలో 4, నిజామాబాద్ లో 3, మహబూబ్ నగర్, కరీంనగర్, ములుగు జిల్లాలలో 2 కేసుల చొప్పున, సిద్ధిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 164 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 2278 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2032 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu