తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 213 కేసులతో కలిపి జూన్ 16, మంగళవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5406 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు మొత్తం 1,251 మందిని పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 191 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 165 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 16, మెదక్లో 13, కరీంనగర్లో 6, మేడ్చల్ జిల్లాలో 3, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలలో 2 కేసుల చొప్పున, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, పెద్దపల్లి, కొమరం భీం అసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 213 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 261 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3027 కి చేరింది. ప్రస్తుతం 2,188 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu