తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన 219 కేసులతో కలిపి జూన్ 15, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5193 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు కలిపి 449 మంది ఉన్నారు. అలాగే మరో ఇద్దరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 187 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 189 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ లో 4, వరంగల్ రూరల్ లో 3, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలలో 2 కేసుల చొప్పున, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 219 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 2766 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2240 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu