ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,573 కు, మరణాల సంఖ్య 6291 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 72,082 కరోనా పరీక్షలు నిర్వహించగా 4622 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 35 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, కడపలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6291 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 7,14,427 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 5715 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 42855 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu