తెలంగాణలో రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. కొత్తగా 485 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 30, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,00,476 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 257, సంగారెడ్డిలో 73, రంగారెడ్డిలో 58, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 37, ఖమ్మంలో 10 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 236 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,91,944 కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూన్ 30, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,55,85,456
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,00,476
- కొత్తగా నమోదైన కేసులు : 485
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,91,944
- కరోనా రికవరీ రేటు: 98.93%
- యాక్టీవ్ కేసులు: 4,421
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
- కరోనా మరణాల రేటు: 0.51%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY