తెలంగాణ రాష్ట్రంలో మరో 730 కరోనా కేసులు, 210 కి చేరిన మరణాలు

7 Deaths In Telangana, 730 New Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus updates Live, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths

తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 730 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 730 కేసులతో కలిపి జూన్ 21, ఆదివారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు మొత్తం 3297 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 210 కి పెరిగినట్టు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా జీహెచ్‌ఎంసీ ఏరియాలో 659 కేసులు, జనగామ లో 34, రంగారెడ్డి‌ జిల్లాలో 10, మేడ్చల్ లో 9, వరంగల్ లో 6, ఆసిఫాబాద్ లో 3, వికారాబాద్ లో 2, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణ్ పేట్, మెదక్, నల్గొండ, యాదాద్రి ఒక్కోకేసు చొప్పున మొత్తం 730 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 225 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3731 కి చేరింది. ప్రస్తుతం 3861 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =