దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 1, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,82,895 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530740 గా ఉంది. ఇక జనవరి 31న 1,59,069 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.07 శాతంగా నమోదైంది.
దేశంలో 1,783 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,783 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 83 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,50,372 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (26), కర్ణాటక (26), ఒడిశా (11), మహారాష్ట్ర (11), తెలంగాణ (6) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE