తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 887 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,08,776 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1701 కి పెరిగింది. కొత్తగా 337 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,01,564 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 201 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 31, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,02,10,906
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 3,08,776
- కొత్తగా నమోదైన కేసులు : 887
- నమోదైన మరణాలు : 4
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 3,01,564
- కరోనా రికవరీ రేటు: 97.66%
- యాక్టీవ్ కేసులు: 5,511
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 2,166
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1,701
- కరోనా మరణాల రేటు: 0.55%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ