తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 92 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,742 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు. అలాగే కొత్తగా నమోదైన 5 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 142 కి చేరినట్టు తెలిపారు.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 50 సంవత్సరాల లోపు వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేని 393 మందిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు. అందులో 310 మందిని వారి ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంచగా, వసతి సదుపాయాలు లేని 83 మందిని అమీర్ పేట్ లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ కు తరలించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu