నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, ఇందూరు కళా భారతి ఆడిటోరియానికి శంకుస్థాపన

Minister KTR Visits Nizamabad Today Lays Foundation Stone for Induru Kala Bharati Auditorium,Minister KTR Visits Nizamabad,Lays Foundation Stone,Induru Kala Bharati Auditorium,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ పట్టణంలో పర్యటించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ముఖ్యంగా పాత కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ఇందూరు కళా భారతి ఆడిటోరియం భవనానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే నగరంలోని రైల్వే కమాన్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జిని కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, మహమ్మద్ షకీల్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

శనివారం ఉదయం ముందుగా నిజామాబాద్‌ పట్టణంలో కాకతీయ స్యాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ డెవలప్‌మెంట్ డైలాగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్’పై మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు మరియు ఫైర్‌సైడ్ చాట్‌లో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అనంతరం రైతులు మరియు స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 2 =