తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 38 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2511 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 4, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 62,132 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 877 కి పెరిగింది. ఇప్పటివరకు 1,04,603 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 32,915 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75.5 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.63 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2511):
- జీహెచ్ఎంసీ – 305
- రంగారెడ్డి – 184
- నల్గొండ – 170
- కరీంనగర్ -150
- ఖమ్మం – 142
- మేడ్చల్ – 134
- వరంగల్ అర్బన్ – 96
- సూర్యాపేట – 96
- భద్రాద్రి కొత్తగూడెం – 93
- నిజామాబాద్ – 93
- జగిత్యాల – 85
- సిద్దిపేట – 80
- యాదాద్రి భువనగిరి – 78
- మంచిర్యాల – 73
- రాజన్నసిరిసిల్ల – 72
- సంగారెడ్డి – 70
- పెద్దపల్లి – 65
- కామారెడ్డి – 60
- మహబూబాబాద్ – 58
- మహబూబ్నగర్ – 42
- మెదక్ – 42
- వనపర్తి – 40
- నాగర్కర్నూల్ – 40
- జనగామ – 38
- వరంగల్ రూరల్ – 36
- నిర్మల్ – 31
- జోగులాంబ గద్వాల్ – 27
- ఆదిలాబాద్ – 23
- వికారాబాద్ – 19
- ఆసిఫాబాద్ – 23
- ములుగు – 18
- నారాయణ్ పేట్ – 16
- జయశంకర్ భూపాలపల్లి – 12
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu