జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీనుంచి రాష్ట్రస్థాయి నాయకులే కాకుండా పలువురు జాతీయ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రచారం నిమిత్తం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయనేతలు రావడంపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “వరద లాగా ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాదుకు స్వాగతం. ఈ రాక ఏదో, నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేది. ఉత్త చేతులతో రాకుండా, వస్తూ సీఎం కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా రు1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నా” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ