తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 13, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 88,396 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 22,046 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 674 కి పెరిగింది. ఇప్పటివరకు 64,284 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 23,438 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.72 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.76 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1921):
- జీహెచ్ఎంసీ – 356
- మేడ్చల్ – 168
- రంగారెడ్డి – 134
- సంగారెడ్డి – 90
- వరంగల్ అర్బన్ – 74
- కరీంనగర్ – 73
- నల్గొండ – 73
- ఖమ్మం – 71
- సిద్ధిపేట – 63
- నిజామాబాద్ – 63
- పెద్దపల్లి – 54
- వరంగల్ రూరల్ – 54
- జోగులాంబ గద్వాల్ – 51
- మహబూబ్ నగర్ – 48
- సూర్యపేట – 47
- కామారెడ్డి – 44
- వనపర్తి – 41
- జగిత్యాల – 40
- మెదక్ – 39
- మహబూబాబాద్ – 38
- జనగామ – 38
- నిర్మల్ – 37
- భద్రాద్రి కొత్తగూడెం – 34
- రాజన్న సిరిసిల్ల – 33
- ఆదిలాబాద్ – 28
- నాగర్ కర్నూల్ – 26
- జయశంకర్ భూపాలపల్లి – 21,
- మంచిర్యాల – 18
- యాదాద్రి భువనగిరి – 16
- ఆసిఫాబాద్ – 17
- వికారాబాద్ – 14
- ములుగు – 12
- నారాయణ్ పేట్ – 6
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu