భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఆగస్టు 23, ఆదివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,44,940 కు, మరణాల సంఖ్య 56,706 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 69,239 కరోనా పాజిటివ్ కేసులు, 912 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.87 శాతంగా ఉంది. మరోవైపు ఒకే రోజులో 57,989 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 22,80,566 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 74.69 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 7,07,668 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu