తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. కొత్తగా 2474 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 21, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 43,095 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 744 కి పెరిగింది. ఇప్పటివరకు 78,735 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,386 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.29 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.73 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2474):
- జీహెచ్ఎంసీ – 447
- రంగారెడ్డి – 201
- నిజమాబాద్ – 153
- మేడ్చల్ – 149
- ఖమ్మం – 125
- వరంగల్ అర్బన్ – 123
- నల్గొండ – 122
- సిద్దిపేట – 92
- జగిత్యాల – 91
- పెద్దపల్లి – 79,
- కరీంనగర్ – 75
- సంగారెడ్డి – 72
- సూర్యాపేట – 63
- కామారెడ్డి – 61
- జోగుళాంబ గద్వాల్ – 59
- మహబూబాబాద్ – 59
- మంచిర్యాల – 53
- రాజన్న సిరిసిల్ల – 52
- నాగర్కర్నూల్ – 52
- మహబూబ్నగర్ – 49
- భద్రాద్రి కొత్తగూడెం – 44
- మెదక్ – 38,
- వనపర్తి – 37
- యాదాద్రి భువనగిరి – 28
- వరంగల్ రూరల్ – 22
- జనగామ – 20
- నిర్మల్ – 19,
- జయశంకర్ భూపాలపల్లి – 19
- వికారాబాద్ – 18
- ములుగు – 15
- ఆదిలాబాద్ – 15
- నారాయణ్ పేట్ – 11
- ఆసిఫాబాద్ – 11
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu