తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 5, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,902 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 5290 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 295 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1166 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 12703 కి చేరింది. ప్రస్తుతం 10904 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1590):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1277
- మేడ్చల్ – 125
- రంగారెడ్డి – 82
- సూర్యాపేట -23
- మహబూబ్ నగర్ – 19
- సంగారెడ్డి – 19
- నల్గొండ – 14
- కరీం నగర్ – 4
- వనపర్తి – 4
- నిజామాబాద్ – 3
- మెదక్ – 3
- నిర్మల్ – 2
- వికారాబాద్ – 2
- భద్రాద్రి కొత్తగూడెం – 2
- జనగామ – 2
- గద్వాల్ – 1
- రాజన్న సిరిసిల్ల – 1
- సిద్ధిపేట -1
- వరంగల్ రూరల్ -1
- నారాయణపేట్ -1
- పెద్దపల్లి – 1
- యాదాద్రి – 1
- కామారెడ్డి – 1
- ఆదిలాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu