తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 531 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 24, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,303 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
మరోవైపు తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 281, రంగారెడ్డిలో 42, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 34, ఖమ్మంలో 22, మహబూబాబాద్ లో 17, హనుమకొండలో 15, నల్గొండలో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 10 నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,630 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 612 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,05,562 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.93 శాతంగా, మరణాల రేటు 0.50 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY