కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసు విభాగంలో కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. దీంతో అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన పోలీస్ స్టేషన్లను గుర్తించి, వాటిని మూసివేయాలని బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 20 పోలీసు స్టేషన్లను మూసేసినట్లు ప్రకటించారు. కేసులు నమోదవుతున్నపటి నుంచి స్టేషన్లను శానిటైజ్ చేస్తున్నామని, అయితే ప్రజల భద్రతా దృష్ట్యా మూసివేస్తునట్టు పేర్కొన్నారు. ఇలా మూసివేసిన పోలీస్ స్టేషన్ల వద్ద ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కర్ణాటకలో ఇప్పటికి 23474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 372 మంది మరణించారు. బెంగళూరు అర్బన్ పరిధిలో 9580 కేసులు నమోదవగా, 145 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu