తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 66,677 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 19,202 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 540 కి పెరిగింది. ఇప్పటివరకు 47,590 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 18,547 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.80 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1891):
- జీహెచ్ఎంసీ – 517
- రంగారెడ్డి – 181
- మేడ్చల్ – 146
- వరంగల్ అర్బన్ – 138
- నిజామాబాద్ – 131
- సంగారెడ్డి – 111
- కరీంనగర్ – 93
- ఖమ్మం – 47
- నల్గొండ – 46
- కామారెడ్డి – 42
- జోగులాంబ గద్వాల్ – 38
- పెద్దపల్లి – 37
- సూర్యాపేట – 35
- మహబూబ్ నగర్ – 33
- భద్రాద్రి కొత్తగూడెం – 32
- మంచిర్యాల – 28
- రాజన్న సిరిసిల్ల – 28
- సిద్ధిపేట – 27
- మహబూబాబాద్ – 24
- వరంగల్ రూరల్ – 22
- మెదక్ – 21
- ఆదిలాబాద్ – 19
- జనగామ – 15
- జగిత్యాల – 14
- వనపర్తి – 13
- యాదాద్రి భువనగిరి – 12
- నారాయణ్ పేట్ – 11
- ములుగు – 11
- నిర్మల్ – 8
- వికారాబాద్ – 8
- ఆసిఫాబాద్ – 2
- నాగర్ కర్నూల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu