తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 4, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,958 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. మంగళవారం నాడు కొత్తగా 2012 కేసులు నమోదవగా, 21118 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 13 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 576 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 50814 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 19,568 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.6 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.81 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2012):
- జీహెచ్ఎంసీ – 532
- మేడ్చల్ – 198
- రంగారెడ్డి – 188
- వరంగల్ అర్బన్ – 127
- ఖమ్మం – 97
- సంగారెడ్డి – 89
- నిజామాబాద్ – 83
- కామారెడ్డి – 75
- కొత్తగూడెం – 52
- మహబూబ్నగర్ – 51
- నల్గొండ – 49
- జోగులాంబ గద్వాల్ – 48
- భూపాలపల్లి – 46
- పెద్దపల్లి – 41
- కరీంనగర్ – 41
- మహబూబ్నగర్ – 36
- సిద్దిపేట – 28
- వరంగల్ రూరల్ – 28
- జగిత్యాల – 27
- సూర్యాపేట – 27
- భువనగిరి – 26
- మెదక్ – 21
- వనపర్తి – 20
- ములుగు – 18
- నాగర్కర్నూల్ – 19
- ఆదిలాబాద్ – 15
- సిరిసిల్ల – 10
- నిర్మల్ – 9
- వికారాబాద్ – 6
- నారాయణపేట – 4
- మంచిర్యాల – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu