తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 14, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. శుక్రవారం నాడు కొత్తగా 1863 కేసులు నమోదవగా, 21,239 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 684 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 66,196 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 23,379 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73.34 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.75 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1863):
- జీహెచ్ఎంసీ – 394
- మేడ్చల్ – 175
- రంగారెడ్డి – 131
- కరీంనగర్ – 104
- వరంగల్ అర్బన్ – 101
- రాజన్న సిరిసిల్ల – 90
- సంగారెడ్డి – 81
- జగిత్యాల – 61
- ఖమ్మం – 61
- సిద్ధిపేట – 60
- జోగులాంబ గద్వాల్ – 58
- నల్గొండ – 49
- వరంగల్ రూరల్ – 41
- పెద్దపల్లి – 40
- నిజామాబాద్ – 39
- భద్రాద్రి కొత్తగూడెం – 36
- మెదక్ – 36
- జనగామ – 34
- సూర్యాపేట – 33
- కామారెడ్డి – 31
- నిర్మల్ – 28
- వనపర్తి – 26
- నాగర్ కర్నూల్ – 24
- ఆదిలాబాద్ – 18
- మహబూబ్ నగర్ -18
- వికారాబాద్ – 16
- యాదాద్రి భువనగిరి – 15
- మహబూబాబాద్ – 14
- ములుగు – 13
- జయశంకర్ భూపాలపల్లి – 12
- ఆసిఫాబాద్ – 12
- మంచిర్యాల – 7
- నారాయణ్ పేట్ – 5
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu